బీజేపీ ఎంపీ జీవీఎల్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ 

బీజేపీ ఎంపీ జీవీఎల్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 05:35 AM IST
బీజేపీ ఎంపీ జీవీఎల్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ 

బీజేపీ ఎంపీ జీవీఎల్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది.

అమరావతి: బీజేపీ ఎంపీ జీవీఎల్ కామెంట్లపై టీడీపీ సీరియస్ అయింది. జీవీఎల్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ కు తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నోటీసు అందించారు. సీఎం చంద్రబాబుపై జీవీఎల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీని కించపరిచేలా జీవీఎల్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబును ’అసెంబ్లీ రౌడీ’ అంటూ జీవీఎల్ ట్వీట్ చేశాడు. జీవీఎల్ కామెంట్లపై టీడీపీ అగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీపై ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రివిలైజ్ పోటీసు ఇచ్చారు.

 

గతకొంతకాలంగా టీడీపీ, బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రధాని మోడీ.. ఏపీకి ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు విస్మరించారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. మోడీ మాట తప్పారని విమర్శిస్తున్నారు. నమ్మకం ద్రోహం చేశారని మండిపడుతున్నారు. అదేస్థాయిలో బీజేపీ నేతలు కూడా టీడీపీపై విమర్శలు చేస్తున్నారు.