మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన టీచర్
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి... వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్ విద్యార్థులను చితకబాదారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి… వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్ విద్యార్థులను చితకబాదారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి… వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. తమ ప్రవర్తనతో పవిత్ర ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్ విద్యార్థులను చితకబాదారు.
అనంతపురం జిల్లా హిందూపురం మండలం కిరికెరబసవనపల్లి పాఠశాలలో నారాయణ అనే ఉపాధ్యాయుడు మందుకొట్టి స్కూల్కు వచ్చాడు. అంతేకాదు.. మద్యం మత్తులో విద్యార్థులను చితక్కొట్టాడు. అనంతరం పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామస్తులు నారాయణ టీచర్పై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.
గతంలో రకరకాల కారణాలతో టీచర్స్, ప్రిన్సిపల్ విద్యార్థును దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. హోంవర్క్ చేయలేదని, ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థులపై దాడి చేసి, గాయపర్చారు. ఇకపోతే ప్రైవేట్ విద్యాలయాల యాజమాన్యాల వేధింపులకు లెక్కేలేదు.