గద్వాల టీఆర్ఎస్ మున్సిపల్లోకి ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు
గద్వాల జిల్లా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు చేరారు. మున్సిలప్ బరిలో ఇంటిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కనున్నారు.
కాగా..తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా మారిపోయింది. కారు స్పీడ్ కి ఎదురులేకుండా పోయింది. దీంతో మున్సిపల్ ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం నింపాయి. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
మున్సిపల్ ఫలితాలపై నేతలు స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అని చెప్పడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమనీ..ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పడానికి ఈ ఫలితాలే రుజువు అన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, అందుకే పుర పోరులో టీఆర్ఎస్ కి పట్టం కట్టారని టీఆర్ఎస్ అగ్రనేతలు ఆనందం వ్యక్తంచేశారు. ప్రత్యర్థులు అందుకోలేని విజయాన్ని టీఆర్ఎస్ సాధించిందనీ కొనియాడారు.