రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 05:05 AM IST
రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.

కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఎమ్మిగనూరు ఈద్గాకు చెందినవారిగా గుర్తించారు. 
Read Also : సినిమా ఆపుతారా : మమత సర్కార్‌కు రూ. 20 లక్షల ఫైన్

కర్ణాటక రాష్ట్రంలోని బడేచౌడీ దర్గాకు వెళ్లి వస్తుండగా రాయచూరు నుంచి వస్తున్న ఓ కారు రోడ్డు పై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను వేగంగా ఢీకొంటింది. రాయచూరులోని ఓ దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మరో వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

కాగా అతివేగంతో ప్రతీ రోజు పలు రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వార్తలు వింటునే ఉన్నాం..చూస్తునే ఉన్నాం. అయినా వాహనాలు నడిపేవారు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాటంలేదు. దీంతో వారితో పాటు పలుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ అతివేగానికి మూడు ప్రాణాలు బలైపోయాయి. ఇప్పటికైనా వాహనాలు నడిపేవారు అప్రమత్తతంగా ఉండాల్సిన అవసరముంది. 
Read Also : ఇందిరా గాంధీ సంప్రదాయం : హోమం చేసిన సోనియా గాంధీ