కూలీ పనులకు వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ చెరువులో పడి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 07:03 AM IST
కూలీ పనులకు వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ చెరువులో పడి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

కూలీ పనులకు వెళ్తూ మృత్యులోకాలకు వెళ్లారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

కూలీ పనుల కోసం ట్రాక్టర్ లో వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. జీళ్ల చెరువు నుంచి అగ్రహారం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం జీళ్ల చెరువు సమీపంలో ఘటన జరిగింది.

చెరువులో ట్రాక్టర్ బోల్తా పడగా..స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. మృతుల కుబుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.