ఆయన ఇప్పుడు పునీతుడు : శేఖర్ రెడ్డికి పదవిపై సమర్ధించుకున్న టీటీడీ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలోకి ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. వీరిలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, వ్యాపారవేత్త శేఖర్రెడ్డి కూడా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుంది.
ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శేఖర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడం పట్ల వివరణ ఇచ్చారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో తమిళనాడుకు చెందిన ఏజే శేఖర్ రెడ్డి పేరు ఉండగా.. గతంలో శేఖర్ రెడ్డిపై కేసులు ఉన్న మాట వాస్తవమే కానీ, ఆదాయపు పన్ను కేసుల నుంచి శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ వచ్చినట్లు వెల్లడించారు. అందువల్లే అతనిని బోర్డులోకి ఆహ్వానించినట్టు చెప్పుకొచ్చారు.
అప్పట్లో కేసులు వచ్చినవి కాబట్టి అప్పుడు అతనిపై ప్రతిపక్షంలో ఉండి పోరాడామని, అయితే అతనిపై కేసులు కొట్టేయడంతో దేవుడికి సేవయ చేసుకునేందుకు నిస్వార్ధంగా ముందుకు వస్తున్నారని, స్వామివారికి ఇప్పటికే సేవలు అందిస్తున్నారని, కేసులు తొలిగిపోయాయి కాబట్టి తీసుకున్నారని అన్నారు.