యోగీ కేబినెట్‌లో తొమ్మిదిమందికి కరోనా పాజిటివ్

  • Published By: nagamani ,Published On : August 18, 2020 / 02:38 PM IST
యోగీ కేబినెట్‌లో తొమ్మిదిమందికి కరోనా పాజిటివ్

యూపీ లేదు ఏపీ లేదు..కరోనా మహమ్మారికి. ఏపీలో పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతుంటూ అటు యూపీలో మంత్రులకు కరోనా తగులుకుంటోంది. వదల బొమ్మాలీ అన్నట్లుగా యూపీ మంత్రులు వరుసగా కరోనా సోకుతోంది. ఇప్పటికే ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో ఇద్దరు మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ లు కరోనా మహమ్మారికి బలైపోయారు. తాజాగా.. ఆరోగ్యశాఖ మంత్రి అతుల్ గర్గ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.



అలాగే ఇప్పటికే …గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్, ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్, జల విద్యుత్‌శాఖ మంత్రి మహేంద్ర సింగ్, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ, ఆయుష్ రాష్ట్ర మంత్రి ధరం సింగ్ సైపీలకు కరోనా సోకింది. వీరందరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.