రంగంలోకి అబ్బాయ్‌లు : బాబాయ్‌ గెలుపు కోసం ప్రచారం

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు రెడీ అయ్యారు. ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 02:10 PM IST
రంగంలోకి అబ్బాయ్‌లు : బాబాయ్‌ గెలుపు కోసం ప్రచారం

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు రెడీ అయ్యారు. ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు రెడీ అయ్యారు. ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రచార పర్వంలోకి దిగాడు. రాంచరణ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. వరుణ్ తేజ్ పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం(ఏప్రిల్ 6, 2019) రోడ్ షో లో పాల్గొన్నాడు. జనసేన తరుఫున ప్రచారం చేశాడు. ఇక రాంచరణ్ ఆదివారం(ఏప్రిల్ 7, 2019) నుంచి బాబాయ్ పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నాడని, రెండు రోజుల పాటు బాబాయ్ వెంట ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి

జనసేనాని పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోలింగ్ కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మెగా ఫ్యామిలీ యువ హీరోలు క్యాంపెయిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నేరుగా ప్రచార బరిలోకి దిగడం లేదు. మామయ్యలకు ట్విట్టర్ ద్వారా తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వల్ల మార్పు సాధ్యమవుతుందని, సీఎంగా బాబాయ్ పీఠమెక్కడం ఖాయమని వరుణ్ తేజ్ అంటున్నారు. తన తండ్రి నాగబాబు కూడా రాజకీయాల్లో రాణిస్తారని, ఆయన గెలుపు కూడా ఖాయమని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు.
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే