చితక్కొట్టారు : విద్యార్థినులను వేధిస్తున్న కీచక వార్డెన్

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 08:17 AM IST
చితక్కొట్టారు : విద్యార్థినులను వేధిస్తున్న కీచక వార్డెన్

విద్యార్దులను లైంగికంగా వేధిస్తున్న వార్డెన్ ను తల్లిదండ్రులు చితకబాదారు. వికారాబాద్ జిల్లా యారాల మండలం రసూల్ పూర్ లోని ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఏడు, ఎనిమిది క్లాస్ విద్యార్ధినిలకు వార్డెన్ దశరథ్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఇద్దరు విద్యార్దినులను గత వారం రోజులుగా వేధిస్తున్నాడు. శారీరంగా హింసలకు గురి చేశాడు.

దీంతో వార్డెన్ దశరథ్ వేధింపులు భరించలేక చిన్నారులు ధైర్యం చేసి..తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు హుటాహుటిన స్కూల్ కు చేరుకుని దశరథ్ ను చితకబాదారు. అనంతరం స్కూల్ యాజమాన్యానికి చెప్పాగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్కూల్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వార్డెన్ దశరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు.