వార్డు వాలంటీర్ని హత్య చేసిన జర్నలిస్ట్
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. సహజీవనంలో విభేదాలు రావడంతో మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నానికి చెందిన వార్డు వాలంటీర్ రెడ్డి శ్రీదేవి భర్తతో విడాకులు తీసుకుని, టీవీ ఛానెల్ రిపోర్టర్గా ఉన్న మురళీ అనే వ్యక్తితో రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గొడవ పడ్డారు. దీంతో విడిపోయిన ఇద్దరు ఎవరికివారుగా ఉంటున్నారు.
అయితే ఆ విషయాన్ని తట్టుకోలేని మురళీ మంగళవారం(31 డిసెంబర్ 2019) మద్యం తాగి దేవీ తన అమ్మగారి ఊరు వెళ్లగా.. అక్కడకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. అయితే తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ.. దేవి పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో కోపోద్రేక్తుడైన మురళీ పక్కనే ఉన్న ఇనుపరాడ్డు తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే నిందితుడు మురళీ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దేవీకి ఇద్దరు పిల్లలు. కాగా బాబు శ్యామ్ వేములపూడి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. పాప హానీ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆమె చనిపోవడంతో వారు అనాథలయ్యారు. నర్సీపట్నంలోని 22వ వార్డు వాలంటీర్గా రెడ్డి దేవి పని చేస్తున్నారు.