విజయ్ సాయి తిట్ల పురాణం : చంద్రబాబు వృద్ధ జంబూకం 

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 08:18 AM IST
విజయ్ సాయి తిట్ల పురాణం : చంద్రబాబు వృద్ధ జంబూకం 

సోషల్ మీడియా వేదికగా వైసీపీ,టీడీపీల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ వృద్ధ జంబూకం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.  రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు నారా చంద్ర‌బాబు నాయుడు గారేననీ.. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారని ఆరోపించారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారు. 600 మందిని హత్య చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారు.  అంటు విరుచుకుపడ్డారు. 

మరో ట్వీట్‌లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా ఉతికి ఆరేశారు. తండ్రీ కొడుకులిద్దరూ.. ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారంటూ ట్వీట్ చేశారు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయని.. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని.. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

ఇంకో ట్వీట్‌లో..చిత్తు చిత్తుగా ఓడిపోయి 3 నెలలు కాలేదు. మిమ్మల్ని ఓడించిన ప్రజలు రాక్షసులా ?  ఏకపక్ష తీర్పుతో వారు విజయ తిలకం దిద్దిన వ్యక్తి భస్మారుడా ? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా ? ఈ వయసులోనే మెదడులో చిప్ పాడైనట్లుంది. కాస్త రిపేర్ చేయించండి. లోకేశ్ కాబోయే పార్టీ అధ్యక్షుడు కదా?  అంటూ ట్వీట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్లో నారా లోకేష్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

ఇసుక పిడీని అడ్డుకుంటే 24 గంటలు కరెంటు సరఫరా నిలిచి పోయినంతగా గంగ వెర్రులెత్తుతున్నారు. ఇసుకుపై కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఇంకెంత రెచ్చి పోతారో? ఈ ధర్నాల ఉద్దేశం చూస్తుంటే, ఎప్పటిలాగే మావాళ్లను ఇసుక బొక్కనివ్వండి సీఎం గారూ అని వేడుకుంటున్నట్టుగా ఉందంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు.