విద్యార్ధులతో యోగా చేయించండి : హరీశ్ రావు 

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 08:53 AM IST
విద్యార్ధులతో యోగా చేయించండి : హరీశ్ రావు 

6 నుంచి 10 వ క్లాస్ విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోను విద్యార్ధులతో  యోగా చేయించాలని మంత్రి సూచించారు.  తన నియోజకవర్గమైన సిద్ధిపేటలో పర్యటిస్తున్న మంత్రి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేసేందుకు నిధులను విడుదల చేశామని తెలిపారు.  

ప్రైవేటు స్కూల్స్ విద్యార్థుల కంటే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. దాని కోసం టీచర్లంతా కృషి చేయాలని విద్యార్థులు మంచిగా చదవుకోవాలన్నారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను బాధ్యతాయుతంగా పెంచాలని సూచించారు. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ..వారు ఏం చేస్తున్నారో అనుక్షణం గమనించుకోవాలన్నారు.