వైఎస్ విజయమ్మ మాటలకు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే అభ్యర్ధి

  • Published By: vamsi ,Published On : April 1, 2019 / 08:00 AM IST
వైఎస్ విజయమ్మ మాటలకు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే అభ్యర్ధి

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు.. జగన్ అమ్మ విజయమ్మ రోడ్ షోలో మాట్లాడారు. తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అంటూ అప్పుడు వెక్కిరించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో కలిసిపోయారని, ఇప్పుడు జగన్ బీజేపీతో కలిసిపోయాడని మాట్లాడుతున్నాడంటూ విమర్శించారు. జగన్ ఎవరితో కూడా కలవలేదని, సింహం ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తది.. అంటూ జగన్ గురించి చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశాయని, 25మంది ఎంపీలను గెలిపించుకుని మనమే ఢిల్లీతో పోరాడి స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందామని అన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చేవారికే మన మద్దతు అని అన్నారు. ఇదే సమయంలో పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్న కళావతమ్మను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ విజయమ్మ ప్రజలను కోరారు.

ప్రలోభాలకు లొంగకుండా ఉన్న వ్యక్తి వీ. కళావతి అని, ఆమెను గెలిపించుకోవాలని విజయమ్మ కోరగానే ఎమ్మెల్యే అభ్యర్ధి కళావతి కన్నీటిపర్యంతం అయ్యారు. అలాగే గొడ్డేటి మాధవిని ఎంపీగా గెలిపించాలని విజయమ్మ కోరారు.