జెన్‌‌‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు : విజయసాయిరెడ్డి

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 07:47 AM IST
జెన్‌‌‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు : విజయసాయిరెడ్డి

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివమర్శల వర్షం కొనసాగుతునే ఉంది. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని వరుస ఏకేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. 

తెలంగాణ ఏపీ రాష్ట్రాలు విడిపోయిన తరువాత అనుభవజ్ణుడని నమ్మి ప్రజలు చంద్రబాబుని గెలిపిస్తే..అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు.ఎన్టీపీసీ సహా విద్యుత్తు సంస్థలకు 20 వేల కోట్లపైనే బకాయిలు పెట్టి పోయాడు. జెన్‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు.డిస్కమ్‌లను అప్పుల్లో ముంచి ఇప్పుడు చీకటి రోజులొచ్చాయని దొంగ ఏడుపు మొదలెట్టాడు అంటూ విమర్శలు కురిపించారు.