చంద్రబాబు అవినీతి రూ.6లక్షల కోట్లు.. పవన్ కళ్యాణ్ జగన్‌ని చూసి నేర్చుకో: లక్ష్మీపార్వతి

  • Published By: vamsi ,Published On : November 5, 2019 / 04:08 AM IST
చంద్రబాబు అవినీతి రూ.6లక్షల కోట్లు.. పవన్ కళ్యాణ్ జగన్‌ని చూసి నేర్చుకో: లక్ష్మీపార్వతి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.6లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, కాగ్‌తో సహా చాలా సంస్థలు చంద్రబాబు అవినీతి, తప్పులను ఎత్తిచూపాయని ఆమె చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేసిందని, చంద్రబాబు, లోకేష్‌లు రహస్యంగా వందల జీఓలు విడుదల చేశారని విమర్శించారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబుకు ఎంత వయస్సు వచ్చింది అనేది కాదు.. ఎంత బుద్ది వచ్చిందనేది ఆలోచించాలన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ పునిహితో అనే వ్యక్తి సైతం టీడీపీ హయాంలో ఏపీలో పరిస్థితులు అతి దారుణంగా ఉన్నట్లు చెప్పారని అన్నారు.

అవినీతి ద్వారా రాష్ట్రంలో సంపాదించిన డబ్బంతా దేశాలకు తరలించారని ఆరోపించారు. చంద్రబాబు రూ. 6,17,585.19 కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ వైసీపీ పుస్తకం కూడా విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై విచారణ చేయాలంటూ రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లకు లేఖ రాస్తానని అన్నారు లక్ష్మీ పార్వతి.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు గుప్పించారు లక్ష్మీ పార్వతి. దోపిడి దొంగలతో చేరి నీతులు చెబుతావా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్ ఆదర్శం ఏంటో చెప్పాలని, కనీసం పవన్ చేసే పని అతనికైనా అర్థం అవుతుందా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రెండు సీట్లలో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్‌ జగన్‌నే పవన్ విమర్శిస్తాడు. అంటూ విమర్శించారు. వన్‌ మెన్ ఆర్మీలా పోరాడడం  సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని పవన్‌కు హితవు పలికారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుతో దోస్తీ సరికాదని అన్నారు.