Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్‌లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: ఖరీదైన కారు కలిగిన సంపన్నులు హుందాగా ప్రవర్తిస్తారు అనుకుంటాం. కానీ, ఎంత సంపద, హోదా ఉన్నా కొందరు తమ దుర్బుద్ధిని, లోభి తనాన్ని బయటపెట్టుకుంటారు. తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు.

Manish Sisodia: సీబీఐ అరెస్టుపై సుప్రీంకోర్టుకు సిసోడియా.. అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్‌లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది. దీనికి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశం కోసం గురుగ్రామ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మీటింగ్ జరిగే హోటల్స్‌తోపాటు, చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లను అందంగా అలంకరించారు. అనేక చోట్ల కుండీల్లో పూల మొక్కలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను ఖరీదైన కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి.. షరతులు విధింపు!

వీడియో ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద ఒక కాస్ట్లీ కియా కారును ఆపారు. కారు డిక్కీ ఓపెన్ చేసి, అందులో రోడ్డు పక్కన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూల కుండీలను పెట్టుకుని వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని అక్కడి వాళ్లెవరో వీడియో తీయగా అదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత ఖరీదైన కారు ఉండి పూల కుండీలు ఎత్తుకెళ్తున్నారంటే.. ఆ కారు ఎలా సంపాదించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో గురుగ్రామ్ అధికారులు స్పందించారు. పూల కుండీలు ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.