నేల మీద కూర్చొని సంతోషంగా.. : మిలీనియర్ అయిన రతన్ టాటా!

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 10:20 AM IST
నేల మీద కూర్చొని సంతోషంగా.. : మిలీనియర్ అయిన రతన్ టాటా!

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లకు అధిపతి. వ్యాపార సామ్రాజ్యంలో ఆయన స్థాయే వేరు. బిలీనియర్ అయిన రతన్ టాటా ఇప్పుడు మిలీనియర్ అవడం ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. 

గతేడాది అక్టోబర్‌లో ఇన్ స్టాగ్రామ్‌లో అడుగు పెట్టి ఏదో ఒక పోస్ట్ తో తనదైన శైలిలో నెటిజన్లను ఆకట్టుకుంటునే ఉన్నారు. ఈ క్రమంలోనే ఐదు నెలల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ని చేరుకున్నారు ఆయన. ఈ సంధర్భంగా తన ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు రతన్ టాటా.  అంతేకాదు నేలపై కూర్చుని, నవ్వుతూ ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

రతన్ టాటా ఇటీవల తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. తాజాగా తన పేజీ ఫాలో అవుతున్న సంఖ్య 1 మిలియన్ చేరుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. తాను ఇన్ స్టాగ్రామ్ లో చేరినప్పుడు ఇంత అద్భుతమైన ఆన్ లైన్ కుటుంబం ఉంటుందని ఊహించలేదని, దానికి మీకందరికి నేను కృతజ్ఞతలు చెప్పాలి అన్నారు. ఎప్పటి మన ప్రయాణం ఇలానే కొనసాగుతు ఉండాలని నేను ఆశిస్తున్న అని అన్నారు.

రతన్ టాటా ఈ చిత్రాన్ని పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. మీరు దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులలో ఒకరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.