Rains In Telangana : రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను "అసని" పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Rains In Telangana : రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

Rains in Telangana

Rains In Telangana :  నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను “అసని” పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుఫాను సుమారుగా వాయువ్య దిశగా పయనించి ఈరోజు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరంకి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆ తర్వాత తుపాను దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ ఒరిస్సా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అది క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.

ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని అనుకున్న నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను ప్రదేశం నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి మీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్న చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదారాబ్ద లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,ములుగు జయశంకర్ భూపాలపల్లి మరియు మంచిర్యాల జిల్లాలలో రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతోఈదురు గాలులతో కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also Read : Sri lanka crisis: ప్రత్యేక హెలికాప్ట‌ర్‌లో వెళ్లి.. నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!