1992, డిసెంబర్ 6న కొంత మంది రైట్ వింగ్ కార్యకర్తలు అయోధ్యలోని బాబ్రీ మసీదుపై దాడికి దిగారు. మసీదును విధ్వంసం చేస్తూ అయోధ్యలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రదేశంలో రామాలయం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారనే ఏళ్ల నాటి వివాదాన్ని.. 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ విధ్వంసం మరో మలుపుకు తీసుకెళ్లింది. చివరగా సుప్రీం కోర్టు ప్రమేయంతో మసీదు స్థలాన్ని హిందువులకు కేటాయించాలని తీర్పు వచ్చింది. దేశంలో సుదీర్ఘ కాలం సాగిన ఈ అనిశ్చితి గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.