ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా భావజాలపరంగా పూర్తి విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడం, అనంతరం మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోవడం, ఫడ్నవీస్-షిండే కలయికలో ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి. ఇక అసలైన శివసేన గొడవ కోర్టుకు ముందకు వెళ్లడం, ఎన్నికల సంఘం చొరవ తీసుకుని పార్టీని రెండుగా చీల్చడం వరకు మహారాష్ట్రలో ఒక రాజకీయ సంక్షోభం కొనసాగింది. ఇది దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది.