భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్ను తీసుకొచ్చింది.
గోవింద యాప్నే
టీటీ దేవస్థానమ్ యాప్గా అప్గ్రేడ్ చేసింది.
జియో ప్లాట్ఫామ్ ద్వారా ఈ యాప్ను టీటీడీ అభివృద్ధి చేసింది.
గోవింద్ యాప్ను కలిగిఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్ నుండి కొత్త యాప్ను అప్డేట్ చేసుకోవచ్చు.
కొత్తవారు నేరుగా
టీటీ దేవస్థానమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
కొత్త యాప్ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా దర్శన టికెట్లు, వసతి గదులు, పలు రకాల బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి.
టీటీడీ చరిత్ర తదితర అంశాలన్నింటిని యాప్లో అందుబాటులో ఉంచారు.
తిరుమల శ్రీవారికి విరాళాలుకూడా అందజేయవచ్చు.
కొత్తయాప్ ద్వారా ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు.