బుల్లితెరతో పాపులారిటీ సంపాదించుకున్న నటి అనసూయ భరధ్వాజ్.

సినిమా ప్రోగ్రామ్స్ అండ్ టీవీ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేసిన ఈ భామ..

ఇప్పుడు పూర్తిగా ఆ రంగానికి గుడ్ బై చెప్పేసి సినిమాలో బిజీ అయ్యిపోయింది.

క్షణం సినిమాలో విలన్‌గా కనిపించి ఆకట్టుకోవడంతో.. 

వరుసపెట్టి ఆఫర్లు అనసూయ చెంతకి వచ్చాయి.

ఇక రంగస్థలంలో రంగమ్మ అత్తగా నటించి టాలీవుడ్‌లో బలమైన స్థానం దక్కించుకుంది.

ఇటీవల పుష్ప సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ పాత్రలో అదరగొట్టింది.

ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో నటించింది.

ఈ సినిమా ఉగాది నాడు రిలీజ్ కాబోతుంది.

ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అనసూయ..

చీరలో అదరహో అనిపిస్తుంది.