దానిమ్మ పండ్లలో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రోజూ ఒక కప్పు దానిమ్మ పండు జ్యూస్ను తాగిన వారిలో జ్ఞాపకశక్తి పెరిగిందని సైంటిస్టులు తేల్చారు.కనుక దానిమ్మ పండ్ల జ్యూస్ను తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్నారులు చదువుల్లో రాణిస్తారు
క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఈ జ్యూస్ను రోజూ తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు పూర్తిగా పోతాయి.
దీంతో హార్ట్ ఎటాక్లు రాకుండా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. మొటిమల సమస్య ఉన్నవారు రోజూ ఈ పండ్ల జ్యూస్ను తాగితే ప్రయోజనం కలుగుతుంది
ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలుఉంటాయి. రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఒక కప్పు దానిమ్మ పండు జ్యూస్ను తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. లేదా రోజుకు ఒక దానిమ్మ పండును అయినా సరే తినాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి