నల్గొండకు చెందిన సాగర్ కే చంద్ర అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చారు.

డైరెక్టర్ రవిబాబు వద్ద అనసూయ, అమరావతి లాంటి మరికొన్ని సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో చేశారు.

2012లో 'అయ్యారే' సినిమాతో డైరెక్టర్‌గా మారాడు.

2016లో 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో డైరెక్టర్‌గా మంచి విజయం సాధించాడు.

2018లో 'వీర భోగ వసంత రాయలు' సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు.

ప్రస్తుతం 'భీమ్లా నాయక్'తో మరోసారి డైరెక్టర్‌గా భారీ విజయం సాధించాడు.

'భీమ్లా నాయక్' సినిమాతో మున్ముందు ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయో చూడాలి మరి.