వయస్సు పెరిగే కొద్దీ ఎముకలలో సత్తువ కోల్పోతుంటాయి.  ఎముకల బలం కోసం ఇతర వ్యాధులను నివారించడానికి  విటమిన్ D,  కాల్షియం అధికంగా ఉండే  ఆహారాన్ని తినాలని  వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ D కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..

పాలు: పాలు, ఇతర పాల ఉత్పత్తులు నెయ్యి, జున్ను, వెన్న మొదలైనవి ఎముకలను బలంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి..

ఆకు కూరలు, కూరగాయల్లో పోషకాలు అధిక సంఖ్యలో ఉంటాయి. బ్రోకలీ, క్యాబేజీ, కాల్షియం, బచ్చలికూర వంటి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది.

గుడ్డు: గుడ్డు ప్రోటీన్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గుడ్డు లోని పచ్చసొన. శరీరంలో కాల్షియం, విటమిన్ డి స్థాయిలను పెంచుకోవాలనుకుంటే.. గుడ్డు పచ్చసొన తినడం మంచిది.

కొవ్వు చేపలు: సాల్మన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు విటమిన్ D, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉంచడమే గాక మనకు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఇది ఎముకలను కూడా బలపరుస్తుంది.

సోయా పాలు లేదా ఇతర సోయా ఆధారిత ఆహారాలు ఎముకల ఆరోగ్యానినికి ఎంతో మంచివి. ఇందులో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

ఎముకలను బలోపేతం చేయడంలో మెగ్నీషియం, పోటాషియం ముఖ్య పాత్ర పోషిస్తాయి సోయా పాలు.

ఈరెండు పోషకాలు విత్తనాలు, కాయకూరలు, పాలు, అరటి పండ్లు, సోయాలో లభిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్‌ C, విటమిన్‌ కె. విటమిన్‌ A ఎంతో అవసరం.