ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జీ–20 సన్నాహక సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు సూచనలు చేశారు.

ప్రధాని మోదీతో చంద్రబాబు, వైఎస్ జగన్.. విడివిడిగా ప్రత్యేకంగా మాట్లాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కేంద్ర మంత్రులు, ఇత‌ర పార్టీల నేత‌ల‌తో మాట్లాడుతూ క‌నిపించారు. 

జీ-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దాని కోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు.

రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, కానీ జీ-2౦ సదస్సు విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స‌మావేశంలో జ‌గ‌న్‌ కోరారు.