ఎసిడిటీ.. మనుషులను ప్రశాంతంగా ఉండనివ్వదు.

 పుల్లటి తేన్పులు, ఛాతిలో మంట, గొంతులో ఏదో అడ్డుపడినట్లు  ఉంటుంది.

ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే  ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది.

ఉదయాన్నే పరగడపున పుదీనా ఆకులు నమలండి.

భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి.

భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి.

లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి.

ఎసిడిటీ ఉన్నవారు కొద్దిగా అల్లం తినొచ్చు. కానీ, మోతాదు మించొద్దు.

ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు.

ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.