నీరు ఎక్కువగా త్రాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

హైపోనట్రేమియాకు కారణమవుతుంది

ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలో ద్రవం పొంగిపొర్లుతుందని, అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. అధిక నీరు శరీరం లవణ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా వికారం, వాంతులు, తిమ్మిరి, అలసట ఇతర లక్షణాలు కనిపిస్తాయి. 

శరీరంలో ఎలక్ట్రోలైట్‌ను తగ్గిస్తుంది

 ఎక్కువ నీరు తాగినప్పుడు ఎలక్ట్రోలైట్ స్థాయిలు పడిపోతాయి. బ్యాలెన్స్ ఆఫ్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కండరాల నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు సంభవించవచ్చు.

తరచుగా మూత్రవిసర్జన

ప్రతి 15 నిమిషాలకు తరచుగా మూత్రవిసర్జన చేయడం ఇంట్లో, ఆఫీసులో లేదా పాఠశాలలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మూత్రపిండాలు నిరంతరం పని చేస్తాయి. ఫలితంగా, రోజంతా బాత్రూమ్‌కి పరుగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. 

మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది

ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల అలసట వస్తుంది. ఎక్కువ నీరు త్రాగితే మీ మూత్రపిండాలు మరింత కష్టపడి పనిచేయవలసి రావొచ్చు, దీని వలన ఒత్తిడితో కూడిన హార్మోన్ల ప్రతిచర్య శరీరాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

అనేక దేశాలలో పంపు నీటిని శుభ్రపరచడానికి క్లోరిన్ ఉపయోగించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్లోరినేటెడ్ నీటిని ఎక్కువసేపు తీసుకోవడం వల్ల మూత్రాశయం, వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.