భారత్ దేశంలో ఆస్తమా రోగులు 3 కోట్లకు పైగా ఉంటారని అంచనా..

పెరుగుతున్న వాయు కాలుష్యంతో  ఆస్తమా రోగుల సంఖ్య పెరుగుతోంది..

ఆస్తమా లక్షణాలతో బాధపడే వారు ఉపశమనం కోసం కొన్ని రకాల కూరగాయాలు, పండ్లు తీసుకోవాలి..అవేంటో తెలుసుకుందాం..

క్యాప్సికం : ఇందులో విటమిన్ సీ, బెల్ పెప్సర్స్ ఉంటాయి. బెల్ పెప్సర్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోనూట్రియంట్ మంచి ఆరోగ్యానికి సాయపడతాయి.

దానిమ్మలు : ఈ పండ్లలో పీచు, విటమిన్ సీ, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో ఇవి కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తికి మేలు చేస్తాయి.

యాపిల్ : పీచు, యాంటీ ఆక్సిడెంట్లు యాప్సిల్ లో సమృద్దిగా ఉండే యాపిల్స్ బరువు తగ్గడానికి, పేగుల ఆరోగ్యానికి మంచిది. మధుమేహం, గుండె వ్యాధులు, కేన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.

గ్రీన్ బీన్స్ : ఆకుపచ్చని బీన్స్ లో విటమిన్ ఏ, సీ, కే, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఆస్తమా లక్షణాలు తగ్గేందుకు సాయపడతాయి. ఎముకలు బలంగా ఉండడానికి, ఒత్తిళ్లు తగ్గడానికి ఇవి ఆహారంలో తీసుకోవచ్చు.

అల్లం : దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఒత్తిడి నివారణకు, డీఎన్ఏ దెబ్బతినకుండా ఉండేందుకు సాయపడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలతోపాటు అధిక రక్తపోటు, గుండె జబ్బులున్న వారికి అల్లంతో మంచి మేలు జరుగుతుంది.

పాలకూర ప్రొటీన్, ఐరన్, విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కే, పీచు, పాస్ఫరస్, థయమిన్, విటమిన్ ఈ ఉన్నాయి.

టొమాటో జ్యూస్ విటమిన్ సీ, బీ, పొటాషియం తగినంత టమాటాల్లో లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్అయిన లైకోపీన్ కూడా ఇందులో ఉంటుంది. గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఆస్తమా లక్షణాలు తగ్గేందుకు కూడా సాయపడుతుంది.