గ్లాసుడు నీరు..చిటికెడు పసుపుతో ఎన్నో ఆరోగ్యప్రయోజాలున్నాయని చెబుతున్నారు నిపుణులు
పసుపు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే శరీర మంట తగ్గుతుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది..
పసుపు క్యాన్సర్ కణాలను ఇతర భాగాలకు వ్యాపించకుండా చేయడానికి సహాయపడుతుంది.
పసుపు నీరు రోజు తీసుకోవటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.
ఎన్నో రకాల వ్యాధులతో పోరాడే శక్తి గ్లాసుడు పసుపు నీటిలో ఉంది.
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి..
పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపకరిస్తుంది.