మీ డేటాను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఆన్‌లైన్‌లో హ్యాకర్లు ఎల్లప్పుడూ యూజర్లను మోసగించేందుకు ప్రయత్నిస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో యూజర్ల నగదును కూడా తస్కరిస్తుంటారు

భారత్‌లోనూ చాలా మంది యూజర్లకు హ్యాకర్ల ముప్పు పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు

మీ ఆర్థిక డేటాను, పర్సనల్ డేటాను దొంగిలించడానికి హ్యాకర్లు ఇప్పుడు టెలికాం ఆపరేటర్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు

భారత ప్రభుత్వం సైబర్ స్వచ్ఛతా ప్రాజెక్ట్‌కు అనుగుణంగా మీ డివైజ్ ప్రొటెక్ట్ చేసేందుకు ఏదైనా లింక్ క్లిక్ చేయమంటారు.

మీకు కూడా అలాంటి మెసేజ్ వచ్చినట్లయితే.. వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేయండి. ఆ మెసేజ్‌లో ఏ లింక్ కూడా క్లిక్ చేయరాదు

ఎందుకంటే.. స్కామర్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించి.. మీ విలువైన డేటాను దొంగిలించడానికి ఈ ట్రిక్ వాడతారు

టెలికాం డిపార్ట్‌మెంట్ కస్టమర్‌లకు వ్యక్తిగత సమాచారాన్ని చెప్పాలంటూ ఎప్పుడూ కూడా మెసేజ్‌లను పంపదు