టీ20 ప్రపంచకప్-2022లో సెమీఫైనల్‌కు నాలుగు జట్లు చేరుకున్నాయి.

గ్రూప్-1 నుంచి న్యూజీలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.

9న న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

10న ఆడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఢీకొట్టనుంది.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి.

భారత్‌ రెండుసార్లు, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించాయి.

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2009లో భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

2012 టీ20 ప్రపంచ కప్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు నాకౌట్ దశలో ఇప్పటివరకు తలపడలేదు. 

టీ20 ప్రపంచ కప్‌తో పాటు మిగిలిన టీ20 మ్యాచ్‌లతో కలిపి ఇంగ్లండ్ -భారత్ జట్లు మొత్తం 22 మ్యాచ్‌లు ఆడాయి.

12 సార్లు భారత్ జట్టు విజయం సాధించింది.