ఫిబ్రవరి 15 రాత్రి ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా పై ఒక అమ్మాయి దాడికి పాల్పడింది.

సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు అని, పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారుని ధ్వంసం చేసింది.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా దాడి చేసిన అమ్మాయి ఒక యాక్ట్రెస్ అంటా..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకున్న సప్నా గిల్..

భోజ్‌పురి సినిమాలో సూపర్ స్టార్స్‌ అయిన రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ వంటి వారితో కలిసి నటించింది.

‘కాశీ అమర్‌నాథ్’, ‘నిర్హువా చలాల్ లండన్’ మరియు ఇటీవల విడుదలైన ‘మేరా వతన్’ వంటి సినిమాల్లో సప్నా నటించింది.

కాగా పృథ్వీ షా పై సప్నా గిల్ చేసిన దాడికి, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.