జయసుధ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది. బాలీవుడ్‌లో అయితే అందరూ అభినందిస్తారు, ఫ్లవర్ బోకేలు పంపిస్తారు. ఇక్కడ  కనీసం పట్టించుకోరు.

50 ఏళ్ళు అయినందుకు పెద్ద పార్టీ ఇవ్వమని కొంతమంది చెప్పారు. కానీ నాకు అది నచ్చలేదు.

ఇండస్ట్రీలో హీరోలను ఒకలాగా, హీరోయిన్స్‌ను ఒకలాగా చూస్తారు.

హీరోల కంటే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళే ఎక్కువ హడావిడి చేస్తారు.

హీరోలు డ్యాన్సులు సరిగ్గా చేయకపోయినా మమ్మల్నే అనేవాళ్ళు.

ఇక్కడి హీరోయిన్స్ ని, ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్‌ను ఒకలా ట్రీట్ చేస్తారు. వాళ్ల కుక్క పిల్లకు కూడా రూమ్ ఇస్తారు. మనల్ని మాత్రం పట్టించుకోరు.

నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, డిమాండ్ చేసినా ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండేదాన్ని కాదు.

సినీ ఇండస్ట్రీలో నేను డబ్బు ఎలా కూడబెట్టుకోవాలో నేర్చుకోలేకపోయాను.

మా ఎన్నికలు జరిగే సమయంలో ఆ గోల భరించలేక అమెరికాకు వెళ్ళిపోయాను.

మా అసోసియేషన్ బిల్డింగ్ కడతామని మురళీ మోహన్ గారి టైమ్ నుంచి చెబుతున్నారు. ఇంకో పాతికేళ్ళు ఉన్నా అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు.

నాకు పద్మశ్రీ రాలేదని చాలా మంది అడిగారు. కంగాన రనౌత్‌కు ఇప్పించారు. నాకు ఎందుకు రాలేదో నాకు కూడా తెలీదు