రిలయన్స్ జియో కొత్త జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది.

జియో వినియోగదారులకు రూ.6,500 విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది.

రిలయన్స్ డిజిటల్, AJIO, ఇతర సర్వీసులకు గిఫ్ట్ వోచర్‌లను అందిస్తోంది.

ఆఫర్‌లో 4K JioFiber సెట్ టాప్ బాక్స్ ఉచితంగా 100 శాతం ‘Value Back’ స్కీమ్ కూడా ఉంది. 

ఈ కొత్త పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది.

JioFiber అందించే డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 కింద కొత్త JioFiber కనెక్షన్‌ని బుక్ చేసుకోవచ్చు.

6 నెలల వ్యాలిడిటీతో రూ. 599 లేదా రూ. 899 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

కస్టమర్‌లు ఇతర ప్లాన్ బెనిఫిట్స్‌తో పాటు రెండు అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఈ కస్టమర్లందరూ ఈ ప్యాక్‌తో 15 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందవచ్చు.