ఫిఫా వరల్డ్ ఫైనల్ మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్

2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఖతార్ లో ఉత్కంఠంగా జరగగా ఈ ఉత్కంఠ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా గెలిచింది.

36ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ టైటిట్ ను అర్జెంటీనా కైవసం చేసుకోవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల నెరవేరింది.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్, మెస్సీ అభిమానులు ఈ మ్యాచ్ ని వీక్షించారు.

హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మెస్సీ అభిమాని కావడంతో తన ఇంట్లో లైవ్ మ్యాచ్ చూస్తూ సందడి చేసింది.

మెస్సి టీం గెలవడంతో కీర్తి కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.