లతా మంగేష్కర్ తెలుగులో పాడిన మూడు పాటలు

1955లో ఏఎన్నార్, సావిత్రి నటించిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ లతాజీ పాడిన తొలి తెలుగు పాట.

1965లో ఎన్టీఆర్, జమున నటించిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో ‘శ్రీ వేంకటేశా..’ అనే గీతాన్ని ఆలపించారు లతాజీ.

లతా మంగేష్కర్ చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు.