కాఫీ లేదా టీ లేదా జ్యూస్ తాగుతూనో ద్రవ పదార్ధాలతో ట్యాబ్లెట్లను వేసుకోవడం కరెక్ట్ కాదు
తెలియక చేసే ఆ చిన్న పొరపాటు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇతర ద్రవాలతో కలపి ట్యాబ్లెట్స్ వేసుకుంటే అవి సరిగ్గా కరగవు.
అదే విధంగా ట్యాబ్లెట్లలో ఉండే మందును శరీరం గ్రహించదు.
ఫలితంగా టాబ్లెట్ వేసుకున్నా అనారోగ్యం నయం కాదు.
కనుక ట్యాబ్లెట్లను వేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీటినే తాగాలి.
నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు..
సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి.
వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల పేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి.
ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం తటస్థీకరిస్తుంది.