ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు దీపావళి పండుగను పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఆక్కడ భద్రతా బలగాలతో కలిసి ఆయన దీపావళి జరుపుకుంటున్నారు. వాస్తవానికి పదేళ్లుగా సైనికులతోనే ఆయన దీపావళి చేసుకుంటున్నారు. మరి ఆ పదేళ్ల వివరాలు ఓసారి చూద్దామా?

2014లో సియాచిన్‌లో

2015లో పంజాబ్‌లో

2016లో హిమాచల్ ప్రదేశ్ లో

2017 కాశ్మీర్‌లో

2018లో కేదార్‌నాథ్ ధామ్

2019లో రాజౌరిలో

2020లో రాజస్థాన్‌లో

2021లో నౌషేరాలో

2022లో కార్గిల్‌లో