అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది..
మునగ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
దంతాలు దృఢంగా మారడంలో సహాయం చేస్తుంది.
రెండు కప్పుల నీటిని వేడిచేసి.. మునగ ఆకులు వేసి మరిగించండి. ఆకులతో పాటు బీన్స్ కట్ చేసి వేయవచ్చు.
నీరు సగానికి తగ్గే వరకు మరిగించి నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు కలిపి వడపోసి తాగాలి.
ఇలా చేయడం వల్ల ఎముకలు, దంతాలను దృఢంగా మార్చడంతో పాటు బరువుని కంట్రోల్ చేస్తుంది.
రక్తాన్ని శుభ్రపరచడంలో మునగ ఆకులు బాగా ఉపయోగపడతాయి.
మధుమేహం, హృద్రోగులకు మునగాకు వరంలాంటిది.
మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది.
మునగ ఆకు కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది.