నార్త్కొరియా నరకాసురుడు..కిమ్...
నరకానికి స్పెల్లింగ్ రాయించే క్రూరుడు..
కిమ్ చెప్పినట్టు చేయకుంటే జైలుకు.. వినకుంటే పైకి పంపించేస్తాడు. కిమ్కి కోపమొస్తే అంతే..
తన కోసం ప్రజలు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలని శాసించే అసలు సిసలైన డిక్టేటర్..
లేటెస్ట్గా తన ప్రసంగం కోసం దేశ ప్రజలను, అధికారులను ఎముకలు కొరికే చలిలో అరగంటసేపు నిలబెట్టి నరకం స్పెలింగ్ రాయించాడు..
తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 80వ జయంతి వేడుకలను మైనస్ 15 డిగ్రీల ఉష్టోగ్రతల వాతావరణంలో నిర్వహించాడు కిమ్..
బహిరంగ సభకు ప్రజలు రాక తప్పని పరిస్థితిలో పెద్ద ఎత్తున హాజరయ్యారు. లేదంటే చంపేస్తాడనే భయంతో..
అరగంట కిమ్ ప్రసంగాన్ని వేళ్లు మెలి తిరిగినా.. కాళ్లు చలనం కోల్పోయినా.. కదిలితే ఎక్కడ కాల్చివేస్తాడో అనే భయంతో కదలకుండా విన్నారు ప్రజలు..
ప్రజలు చలిలో నరకం అనుభవిస్తుంటే కిమ్ గారు మాత్రం.. శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి హీటర్లు వాడారంట..
వేదికపైన రెడ్ కార్పెట్ కింద విద్యుత్ వైర్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దటీజ్ శాడిస్ట్ కిమ్ అంటూ నెటిజన్లు
కొన్ని వారాల క్రితం.. తండ్రి కిమ్ జోంగ్ 10వ వర్థంతి సందర్భంగా..దేశంలో ప్రజలెవ్వరూ 11 రోజులు నవ్వకూడదని..
శాసించిన డిక్టేటర్ కిమ్..