కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అల్లాడిపోయారు.. 

కరోనా కొందరి మాత్రం బాగా కలిసొచ్చింది.  రాత్రికి రాత్రే కుబేరులయ్యారు.

కొవిడ్‌-19 సంక్షోభం సమయంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ తయారయ్యాడు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయారు.

 ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ అనే కంపెనీ ఈ వివరాలను రివీల్ చేసింది.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆక్స్ ఫామ్ ఈ నివేదికను బయటపెట్టింది.

కరోనా కాలంలో కొత్త బిలియనీర్లు 573 మంది పుట్టుకొచ్చారు. 

టీకాల పేరిట మోడెర్నా, ఫైజర్ సెకనుకు 1000 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఫార్మా రంగంలో 44మంది కొత్త బిలియనీర్లు చేరారు.