దేశం నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలందరూ తన కుటుంబమని పేర్కొంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు.