‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచమై, రైటర్గా పేరు తెచ్చుకొని, చివరికి డైరెక్టర్ చైర్లో సెటిల్ అయిన దర్శకుడు ‘వెంకీ అట్లూరి’.
వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ.. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు తెరకెక్కించాడు.
ప్రస్తుతం తమిళ హీరో ధనుష్తో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు.
తాజాగా ఈ దర్శకుడు పెళ్లి హైదరాబాద్లో జరగడంతో.. హీరోయిన్ కీర్తి సురేష్, హీరో నితిన్ తన భార్యతో హాజరయ్యారు.
ఇక పెళ్ళిలో కీర్తి వధూవరులతో ఫోటోలు దిగి హంగామా చేసింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కంగ్రాట్స్ తెలిపింది.