కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నేషనల్ క్రష్గా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా తన క్రేజ్ను రష్మిక అమాంతం పెంచేసుకుంది.
ఇక బాలీవుడ్లో వరుస ఆఫర్స్తో పాగా వేయాలని చూసింది ఈ బ్యూటీ.
అమితాబ్ బచ్చన్తో స్క్రీన్ షేర్ చేసుకుని ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
రష్మిక నెక్ట్స్ మూవీ ‘మిషన్ మజ్ను’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు నేరుగ
ా ఓటీటీలో రిలీజ్కు రెడీ అయ్యింది.
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక జంటగా నటించిన ‘మిషన్ మజ్ను’ జనవరి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇలా రష్మికకు బాలీవుడ్లో కష్టాలు తీరడం లేదని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.