ఎందరో మహనీయుల కృషి, త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం పొందిన భారతదేశానికి రాజ్యాంగ రచనలో ఎంతోమంది మేధావుల కృషి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో దాదాపు 60 రాజ్యాంగాలను తులన్మాతక అధ్యయనం చేసి, దాదాపు 3 ఏళ్లపాటు కృషిచేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఇప్పుడు భారత్ 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో భారత రాజ్యాంగ రచనలో మహిళ కృషి తెలుసుకుందాం..