స్టార్ బ్యూటీ సమంత గతకొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవతం కారణంగా సామ్ వార్తల్లోకెక్కింది.
నాగచైతన్యతో విడాకుల తరువాత సామ్ తిరిగి సినిమాల్లో జోరుగా దూసుకెళ్తోంది.
అయితే, మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లుగా సామ్ వెల్లడించింది.
దీంతో, సామ్ ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కానీ, తాను వ్యాధి నుండి కోలుకుంటున్నట్లుగా చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
మయోసైటిస్ చికిత్స తీసుకుంటూనే, సామ్ తన సినిమాలను పూర్తి చేస్తోంది.
గుణశేఖర్ డైరెక్షన్లో ‘శాకుంతలం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్.
ఈ సినిమా ప్రమోషన్స్ను సామ్ ఇటీవల స్టార్ట్ చేసింది.
శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సామ్ భారీ విజయాన్ని అందుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.