కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి మనీ విత్ డ్రా

ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ.

పలు కొత్త సర్వీసులు అందుబాటులోకి. 

ఇందులో ముఖ్యమైనది కార్డు లేకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం. 

ఇకపై ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదు తీసుకునే అవకాశం.

ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇప్పుడు అన్ని ఏటీఎంలకు దీన్ని విస్తరిస్తూ బ్యాంక్‌ యాప్‌ ‘యోనో’ను అప్‌గ్రేడ్‌ చేసింది. 

ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా..

యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునేలా మార్పులు. 

ఇందుకోసం ‘యోనో ఫర్‌ ఎవ్రీ ఇండియన్‌’ థీమ్‌ను తీసుకొచ్చిన ఎస్బీఐ.

యాప్ లో స్కాన్ అండ్ పే, పే టు కాంటాక్ట్‌, పే టు బ్యాంక్ అకౌంట్, రిక్వెస్ట్‌ మనీ వంటి సదుపాయాలు.