గత కొంత కాలంగా కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్లో వార్తలు వస్తూ ఉన్నాయి.
ఇక ఆ వార్తలు నిజం చేస్తూ ఇటీవల వాళ్ళ పెళ్లి వార్తను తెలియజేశారు కియారా, సిద్దార్ద్.
రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వీరిద్దరి వివాహం జరిగింది.
ఫిబ్రవరి 4 నుంచే మొదలైన ఈ పెళ్లి వేడుకలకు ఫిబ్రవరి 7తో ముగిశాయి.
తాజాగా తమ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ఈ కొత్త జంట.