50వ సీజేఐగా డీవీ చంద్రచూడ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. నవంబర్ 9న భారత ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టనున్నారు.జస్టిస్ చంద్రచూడ్ గురించి కొన్ని ముఖ్య విషయాలు
ఎక్కువ కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వైసీ చంద్రచూడ్ కుమారుడే ఈ జస్టిస్ డీవై చంద్రచూడ్. తండ్రి, కొడుకులు భారత ప్రధాన న్యాయమూర్తులుగా పని చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
అసమ్మతిని ప్రజాస్వామ్య సేఫ్టీ వాల్వులని భావించే జస్టిస్ చంద్రచూడ్.. అయోధ్య భూ వివాదం, గోప్యత హక్కు సహా అనేక రాజ్యాంగ బెంచ్లతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మైలురాయి తీర్పులలో భాగంగా ఉన్నారు.
ఐపీసీలోని సెక్షన్ 377 అంశంలోని స్వలింగ సంబంధాలను నేరరహితం చేయడం సహా ఆధార్ పథకం చెల్లుబాటు, శబరిమల సమస్యను పాక్షికంగా కొట్టివేత వంటి తీర్పులు వెలువరించిన బెంచ్లలో చంద్రచూడ్ ఉన్నారు.
చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం పరిధిని, గర్భం దాల్చిన 20-24 వారాల మధ్య అబార్షన్ కోసం అవివాహిత స్త్రీలను చేర్చడానికి సంబంధిత నిబంధనలను విస్తరించింది.
న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్లో ఆనర్స్తో బీఏ పూర్తి చేసిన ఆయన.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అనంతరం హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీ, జురిడికల్ సైన్సెస్లో డాక్టరేట్ పొందారు.